Sunday 19th April 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ముంబై వీధుల్లో క్రికెట్ ఆడుతూ రిషి సునాక్

ముంబై వీధుల్లో క్రికెట్ ఆడుతూ రిషి సునాక్

Rishi Sunak Plays Cricket In Mumbai | యునైటెడ్ కింగ్డమ్ ( UK ) మాజీ ప్రధాని రిషి సునాక్ భారత దేశంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం ముంబై నగరంలో బ్యాట్ పట్టి క్రికెట్ ఆడారు.

రాజస్థాన్ జైపూర్ లో ఐదు రోజుల పాటు జరుగుతున్న లిటరేచర్ ఫెస్టివల్ లో పాల్గొనేందుకు రిషి సునాక్ భారత్ వచ్చారు. శనివారం ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం ముంబై చేరుకున్నారు.

ఈ క్రమంలో ఆదివారం ఉదయం సౌత్ ముంబయి లోని పార్సీ జింఖాన గ్రౌండ్ కు వెళ్లారు. క్లబ్ వార్షికోత్సవాల నేపథ్యంలో అక్కడికి వచ్చిన వారితో కాసేపు ముచ్చటించారు.

ఈ సందర్భంగా కాసేపు బ్యాట్ పట్టి క్రికెట్ ఆడారు. ‘టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడకుండా తన ముంబయి పర్యటన ఎప్పుడూ ముగియదు’ అని రిషి సునాక్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

You may also like
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions