Tuesday 17th June 2025
12:07:03 PM
Home > క్రీడలు > ‘భారీగా పెరిగిన WTC ప్రైజ్ మనీ..ఎన్ని రూ.కోట్లంటే!’

‘భారీగా పెరిగిన WTC ప్రైజ్ మనీ..ఎన్ని రూ.కోట్లంటే!’

Record prize money revealed for WTC Final | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ 2023-25 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం భారీ ప్రైజ్ మనీని ప్రకటించింది.

ఈ ఫైనల్ మ్యాచ్ జూన్ 11 నుంచి 15, వరకు లండన్‌లోని లార్డ్స్ స్టేడియంలో ఆస్ట్రేలియా మరియు దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగనుంది. ఈ సారి ప్రైజ్ మనీని గత రెండు ఎడిషన్‌లతో పోలిస్తే రెట్టింపు చేసిన ICC, టెస్ట్ క్రికెట్‌కు ప్రాధాన్యత ఇవ్వాలనే తమ లక్ష్యాన్ని స్పష్టం చేసింది.

2023-25 WTC ఫైనల్ కోసం మొత్తం ప్రైజ్ మనీ $5.76 మిలియన్ డాలర్లు సుమారు రూ. 49.32 కోట్లుగా ఐసీసీ ప్రకటించింది. ఇది గత రెండు ఎడిషన్‌లలో 2019-21 మరియు 2021-23 ఉన్న $3.8 మిలియన్ డాలర్లతో పోలిస్తే గణనీయంగా పెరిగింది.

ఫైనల్‌లో విజయం సాధించిన జట్టు $3.6 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ. 30.78 కోట్ల పొందుతుంది. ఇది 2021 మరియు 2023 ఎడిషన్‌లలో విజేతలకు ఇచ్చిన $1.6 మిలియన్ డాలర్ల కంటే రెట్టింపు కంటే ఎక్కువ. ఫైనల్‌లో ఓడిన జట్టు $2.16 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ. 18.46 కోట్లు అందుకుంటుంది.

ఫైనల్‌కు అర్హత సాధించని మిగతా ఎనిమిది జట్లు కూడా WTC పాయింట్ల టేబుల్‌లో వారి స్థానం ఆధారంగా ప్రైజ్ మనీ పొందుతాయి. ఈ సారి ఈ జట్లకు కూడా గత ఎడిషన్‌లతో పోలిస్తే ఎక్కువ మొత్తం అందనుంది. మూడవ స్థానంలో ఉన్న ఇండియాకు రూ.12.31 దక్కుతాయి.

You may also like
భార్య చివరి కోరిక తీర్చేందుకు వచ్చి.. విమాన ప్రమాదంలో కన్నీటి గాథలు!
plane crash
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం.. మేడే కాల్ ఇచ్చిన పైలట్లు!
car hangs mid air
Google Map ను నమ్మి ప్రయాణం.. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ పైకి కారు!
ministers
తెలంగాణలో కేబినెట్ విస్తరణ.. కొత్త మంత్రులు వీరే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions