Sunday 3rd May 2026
12:07:03 PM
Home > తాజా > కర్ణాటక ముఖ్యమంత్రితో రాం చరణ్

కర్ణాటక ముఖ్యమంత్రితో రాం చరణ్

Ram Charan meets Karnataka Chief Minister Siddaramaiah in Mysuru | గ్లోబల్ స్టార్ రాం చరణ్ ప్రస్తుతం ‘పెద్ది’ షూటింగ్ నిమిత్తం మైసూర్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కలిశారు.

మైసూర్ లోని నివాసంలో సీఎంను రాం చరణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. కర్ణాటక కార్మిక శాఖ మంత్రి సంతోష్ లాడ్ మరియు ఎమ్మెల్సీ యతింధ్రా సిద్ధరామయ్య కూడా అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా రాం చరణ్ ను ముఖ్యమంత్రి సన్మానించారు. కాసేపు ఇరువురు ముచ్చటించుకున్నారు.

శనివారం అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ మరణించారు. ఈ క్రమంలో రాం చరణ్ అంతిమయాత్రలో పాల్గొన్నారు. పెద్ది షూటింగ్ లో పాల్గొనేందుకు ఆయన తిరిగి మైసూర్ వెళ్లారు.

దర్శకుడు బుచ్చి బాబు పెద్ది సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. ఇందులో రాం చరణ్ సరసన ఝాన్వీ కపూర్ నటిస్తున్నారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions