Thursday 7th May 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > వలలో చిక్కిన చిరుత..వండుకుని తినేసిన వేటగాళ్ళు

వలలో చిక్కిన చిరుత..వండుకుని తినేసిన వేటగాళ్ళు

Poachers Kill And Eat Leopard Meat In Odisha | ఒడిశా రాష్ట్రంలో ఘోరం జరిగింది. వలలో చిక్కిన చిరుత పులిని వండుకుని తినేశారు కొందరు వేటగాళ్లు.

వివరాల్లోకి వెళ్తే, ఒడిశా నౌపడా ( Nuapada ) జిల్లా దియోధర గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో వేతగాళ్ళు అడవి పందుల కోసం వలను ఏర్పాటు చేశారు. అయితే అందులో చిరుత పులి చిక్కింది. ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వాల్సింది పోయి, చిరుతను వండుకుని వారు తినేశారు.

ఈ క్రమంలో పక్కా సమాచారంతో ఫారెస్ట్ అధికారులు నిందితుల ఇళ్లపై దాడులు నిర్వహించారు. అక్కడ చిరుత తోలు, మిగిలిన మాంసం, తల లభించింది. అనంతరం ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.

మరోవైపు ఈ ఘటన పట్ల పీసీసీఎఫ్ ( PCCF ) అధికారి సుశాంత నంద, సమాజంలో ఇటువంటి వారికి చోటులేదన్నారు. తన కెరీర్ లో ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ చూడలేదన్నారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions