Saturday 14th June 2025
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > వలలో చిక్కిన చిరుత..వండుకుని తినేసిన వేటగాళ్ళు

వలలో చిక్కిన చిరుత..వండుకుని తినేసిన వేటగాళ్ళు

Poachers Kill And Eat Leopard Meat In Odisha | ఒడిశా రాష్ట్రంలో ఘోరం జరిగింది. వలలో చిక్కిన చిరుత పులిని వండుకుని తినేశారు కొందరు వేటగాళ్లు.

వివరాల్లోకి వెళ్తే, ఒడిశా నౌపడా ( Nuapada ) జిల్లా దియోధర గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో వేతగాళ్ళు అడవి పందుల కోసం వలను ఏర్పాటు చేశారు. అయితే అందులో చిరుత పులి చిక్కింది. ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వాల్సింది పోయి, చిరుతను వండుకుని వారు తినేశారు.

ఈ క్రమంలో పక్కా సమాచారంతో ఫారెస్ట్ అధికారులు నిందితుల ఇళ్లపై దాడులు నిర్వహించారు. అక్కడ చిరుత తోలు, మిగిలిన మాంసం, తల లభించింది. అనంతరం ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.

మరోవైపు ఈ ఘటన పట్ల పీసీసీఎఫ్ ( PCCF ) అధికారి సుశాంత నంద, సమాజంలో ఇటువంటి వారికి చోటులేదన్నారు. తన కెరీర్ లో ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ చూడలేదన్నారు.

You may also like
భార్య చివరి కోరిక తీర్చేందుకు వచ్చి.. విమాన ప్రమాదంలో కన్నీటి గాథలు!
plane crash
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం.. మేడే కాల్ ఇచ్చిన పైలట్లు!
car hangs mid air
Google Map ను నమ్మి ప్రయాణం.. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ పైకి కారు!
ministers
తెలంగాణలో కేబినెట్ విస్తరణ.. కొత్త మంత్రులు వీరే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions