Poachers Kill And Eat Leopard Meat In Odisha | ఒడిశా రాష్ట్రంలో ఘోరం జరిగింది. వలలో చిక్కిన చిరుత పులిని వండుకుని తినేశారు కొందరు వేటగాళ్లు.
వివరాల్లోకి వెళ్తే, ఒడిశా నౌపడా ( Nuapada ) జిల్లా దియోధర గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో వేతగాళ్ళు అడవి పందుల కోసం వలను ఏర్పాటు చేశారు. అయితే అందులో చిరుత పులి చిక్కింది. ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వాల్సింది పోయి, చిరుతను వండుకుని వారు తినేశారు.
ఈ క్రమంలో పక్కా సమాచారంతో ఫారెస్ట్ అధికారులు నిందితుల ఇళ్లపై దాడులు నిర్వహించారు. అక్కడ చిరుత తోలు, మిగిలిన మాంసం, తల లభించింది. అనంతరం ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.
మరోవైపు ఈ ఘటన పట్ల పీసీసీఎఫ్ ( PCCF ) అధికారి సుశాంత నంద, సమాజంలో ఇటువంటి వారికి చోటులేదన్నారు. తన కెరీర్ లో ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ చూడలేదన్నారు.