Wednesday 16th September 2026
12:07:03 PM
Home > క్రైమ్ > చేవెళ్లలో లారీ బీభత్సం..భీతావాహ పరిస్థితి

చేవెళ్లలో లారీ బీభత్సం..భీతావాహ పరిస్థితి

Chevella Lorry Accident | రంగారెడ్డి జిల్లాలో లారీ బీభత్సం సృష్టించింది. కూరగాయల వ్యాపారులపైకి లారీ దూసుకెళ్లడంతో అక్కడ భీతావాహ పరిస్థితి నెలకొంది.

చేవెళ్ల మండలం ఆలూరి స్టేజి వద్ద 50 మంది కూరగాయలు విక్రయిస్తున్నారు. ఇంతలోనే వారిపైకి లారీ వేగంగా దూసుకొచ్చింది. చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ చెట్టును ఢీకొని ఆగిపోయింది.

కానీ ఇంతలోనే పెను విషాదం జరిగిపోయింది. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురు మృతిచెందినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుండి వెళ్తున్న లారీ బీభత్సం సృష్టించింది.

డ్రైవర్ మాత్రం క్యాబిన్ లోనే ఇరుక్కుపోయాడు. కాగా ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అలాగే క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు.

You may also like
జపాన్‌ సాంకేతిక విద్యపై తెలంగాణ దృష్టి!
తస్మాత్ జాగ్రత్త.. సెల్ ఫోన్ చోరీలతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ!
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions