Sunday 15th June 2025
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > టెర్రరిస్టుల చేతిలో తండ్రి, మామ హత్య.. జమ్మూలో ఎమ్మెల్యేగా గెలిచిన యువతి

టెర్రరిస్టుల చేతిలో తండ్రి, మామ హత్య.. జమ్మూలో ఎమ్మెల్యేగా గెలిచిన యువతి

BJP Shagun Parihar | తండ్రి మామను అత్యంత కిరాతకంగా టెర్రరిస్టులు హత్య చేసినా ఓ యువ నాయకురాలు వెనుకడుగు వేయలేదు.

ఇటీవల జరిగిన జమ్మూకశ్మీర్ ( Jammu and Kashmir ) అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లింలు అత్యధికంగా ఉండే నియోజకవర్గంలో బీజేపీ ( BJP ) తరఫున గెలిచి షాగున్ పరిహార్ ( Shagun Parihar ) సత్తా చాటారు.

మంగళవారం వెలువడిన ఫలితాల్లో కిష్ట్వార్ ( Kishtwar ) నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన షాగున్ పరిహార్ 521 ఓట్ల తేడాతో ఎన్సీ అభ్యర్థి అయిన సీనియర్ నేత సజ్జద్ అహ్మద్ ను ఓడించారు.

ఆమె తండ్రి అజిత్ పరిహార్ మామ అనిల్ పరిహార్ ను 2018 నవంబర్ 1న పంచాయతీ ఎన్నికల ముందు టెర్రరిస్టులు హత్య చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తనకు వేసే ప్రతీ ఓటు తన కుటుంబానికి చెందాడని టెర్రరిస్టుల దాడుల్లో నష్టపోయిన ప్రతీ కుటుంబానికి చెందుతాయి అనే నినాదంతో ఆమె ముందుకు వెళ్లారు.

అలాగే జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో గెలిచిన ముగ్గురు మహిళల్లో షాగున్ పరిహార్ కూడా ఒకరు కావడం విశేషం.

You may also like
car hangs mid air
Google Map ను నమ్మి ప్రయాణం.. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ పైకి కారు!
అమృత్ భారత్ స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని
క్యాన్సర్ బారిన పడిన వ్యక్తికి అండగా సీఎం
‘జల్సాల కోసం రూ.172 కోట్లతో హెలికాప్టర్’..YCP vs TDP

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions