Friday 12th June 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > బంగ్లా హాదీ హత్య..నిందితులు భారత్ లోనే?

బంగ్లా హాదీ హత్య..నిందితులు భారత్ లోనే?

Bangladesh makes a stunning claim in the Hadi murder case | బంగ్లాదేశ్ లో ప్రస్తుతం హింసాత్మక ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఇవి భారత వ్యతిరేక రూపాన్ని తీసుకున్నాయి. బంగ్లాదేశ్ నాయకుడు, ఇంక్విలాబ్ మంచ్ లో ప్రముఖ పాత్ర పోషించిన హరీఫ్ ఉస్మాన్ హాదీ హత్య అనంతరం దేశవ్యాప్తంగా ఆందోళనకు దారి తీశాయి. అయితే హాదీ హత్య కేసులో నిందితులు భారత్ కు పారిపోయినట్లు బంగ్లా రాజధాని డాకా పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం భారత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. విద్యార్థి ఉద్యమంతో భారత అనుకూల షేక్ హసీనా ప్రభుత్వం కూలింది. ఇందులో ఉస్మాన్ బిన్ హాదీ ముఖ్య పాత్ర పోషించారు. కానీ డిసెంబర్ రెండవ వారంలో హాదీ హత్యకు గురయ్యారు.

ఈ హత్య కేసులో ప్రధాన అనుమానితులుగా ఉన్న ఫైసల్ కరీం మసూద్, అలంగీర్ షేక్ భారత్ కు పారిపోయారని బంగ్లా పోలీసులు పేర్కొన్నారు. హాదీ హత్యపై దర్యాప్తు కొనసాగుతుంది. ఈ క్రమంలో ఈ కేసుకు సంబంధించిన కీలక విషయాలను ఆ దేశ పోలీసులు వెల్లడించారు. ఆ ఇద్దరు హలువాఘాట్ సరిహద్దు గుండా భారత్ లోని మేఘాలయ రాష్ట్రానికి పారిపోయారని ఇక్కడ పూర్తి అనే పేరు గల వ్యక్తిని కలిశారని బంగ్లా పోలీసులు తెలిపారు. సామి అనే ట్యాక్సీ డ్రైవర్ ఆ ఇద్దర్ని మేఘాలయలోని తురా నగరానికి తీసుకెళ్లాడని చెప్పారు. అయితే భారత అధికారులు హత్య కేసు అనుమానితులకు సహాయం చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారని బంగ్లా పోలీసులు వెల్లడించారు. బంగ్లా నుంచి పారిపోయిన ఇద్దర్ని తమకు అప్పగించే విషయంలో భారత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు స్పష్టం చేశారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions