Friday 1st May 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ఆ అరటిపండు విలువ రూ.52 కోట్లు

ఆ అరటిపండు విలువ రూ.52 కోట్లు

Banana Sells For Rs.52 Crore In Art Auction | సాధారణంగా పండ్ల మార్కెట్ లో డజను అరటిపళ్ళ ధర రూ.100 లోపే ఉంటుంది. కానీ టేపుతో గోడకు అంటించిన ఒకే ఒక్క అరటిపండు విలువ రూ.52 కోట్లు.

అమెరికా న్యూయార్క్ ( Newyork ) లో నిర్వహించిన వేలంలో బనానా ఆర్ట్ వర్క్ ( Banana Art Work ) ఏకంగా రూ.52 కోట్లకు పలికింది. గోడకు అరటిపండును టేపు సాయంతో అతికించారు. అంతే దీన్ని కొనేందుకు ధనవంతులు ఎగబడ్డారు.

ఇటాలియన్ మౌరిజియో కాటెలాన్ ( Maurizio Cattelan ), కమీడియన్ పేరుతో టేప్ బనానా ఆర్ట్ వర్క్ ను తయారుచేశాడు. తాజగా న్యూయార్క్ లో జరిగిన వేలంలో ఈ బనానా టేప్ ను చైనాకు చెందిన క్రిప్టోకరెన్సీ కంపెనీ బిజినెస్ మాన్ జస్టిన్ సన్ ( Justin Sun ) 6.2 మిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్నాడు.

అయితే అరటిపండు కుళ్ళిపోయినప్పుడల్లా మరొకదాన్ని టేపు కింద పెడుతారు. 2019లో తొలిసారి మియామీలో జరిగిన వేలంలో దీన్ని ప్రదర్శింగా అప్పటినుండి ఈ ఆర్ట్ వైరల్ గా మారింది. 2023లో సౌత్ కొరియా ( South Korea )లోని ఓ మ్యూజియంలో బనానా టేప్ ను ప్రదర్శనకు పెట్టారు.

అయితే ఆకలేస్తుందని ఓ పిల్లాడు అరటిపండును తినేశాడు. వెంటనే మరో అరటిపండును అక్కడ పెట్టారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions