Thursday 6th August 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > బెంగాల్ ఫలితాలు.. ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీ!

బెంగాల్ ఫలితాలు.. ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీ!

bjp telangana

– 150కి పైగా స్థానాల్లో ఆధిక్యం.. పోటాపోటీగా టీఎంసీ!

BJP leading in Bengal | దేశవ్యాప్తంగా గత నెలలో జరిగిన పలు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇందులో దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న పశ్చిమ బెంగాల్ ఫలితాల్లో ఆరంభం నుంచే తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ఉదయం 10:30 గంటల వరకు వెలువడిన ఫలితాలు మరియు ట్రెండ్స్ ప్రకారం రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ (BJP) స్పష్టమైన ముందంజలో కొనసాగుతోంది.

మ్యాజిక్ ఫిగర్ దాటిన బీజేపీ..
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మొత్తం 294 శాసనసభ స్థానాలు ఉండగా, ప్రస్తుతం 293 స్థానాల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇందులో బీజేపీ ఏకంగా 150కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ ప్రభుత్వ ఏర్పాటు దిశగా దూసుకుపోతోంది.

గట్టి పోటీ ఇస్తున్న టీఎంసీ..
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (TMC) కూడా బీజేపీకి గట్టి పోటీ ఇస్తోంది. ప్రస్తుతం టీఎంసీ సుమారు 130 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది.

ఫల్టా నియోజకవర్గంలో రీ-పోలింగ్..
సౌత్ 24 పరగణాల పరిధిలోని ఫల్టా నియోజకవర్గంలో తీవ్ర అక్రమాలు జరిగినట్లు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. ఈ నేపథ్యంలో అక్కడ ఎన్నికను వాయిదా వేసి, రీ-పోలింగ్ నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది.

అందుకే ప్రస్తుతం 293 స్థానాల ట్రెండ్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో బీజేపీ గట్టి సవాల్ విసురుతోంది. ఫలితాలు క్షణక్షణానికి మారుతుండడంతో బెంగాల్ రాజకీయం అత్యంత ఆసక్తికరంగా మారింది.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions