Sunday 23rd August 2026
12:07:03 PM
Home > తాజా > ఓటు రూ.70 వేలు..ఆ అభ్యర్థి ఫలితం ఏంటంటే!

ఓటు రూ.70 వేలు..ఆ అభ్యర్థి ఫలితం ఏంటంటే!

Telangana Muncipal Election Results | తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. అయితే ప్రచార సమయంలో కొందరు అభ్యర్థులు చర్చనీయాంశంగా మారారు. ఇందులో ఒకరు మొయినాబాద్ మున్సిపాలిటీలో కౌన్సిలర్ గా పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి. ఒక్క ఓటుకు రూ.70 వేలు, పట్టు చీర, 25 కేజీల బియ్యం, పప్పుదినుసులు పంచినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. మొయినాబాద్ మున్సిపాలిటీలో ఓ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఏకంగా రూ.7 కోట్లు ఖర్చు చేసినట్లు విస్తృతంగా ప్రచారం జరిగింది. కాగా శుక్రవారం వెలువడిన ఫలితాల్లో సదరు అభ్యర్థి ఘన విజయం సాధించారని కథనాలు వస్తున్నాయి.

200 ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపొందడం విశేషం. మొయినాబాద్ మున్సిపాలిటీలో ఐదుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచారు. ఛైర్మన్ ఎన్నికల్లో వీరే కీలకం కానున్నారు. ఈ క్రమంలో ప్రధాన పార్టీల నుండి మంచి ఆకట్టుకునే ఆఫర్లు రావడం ఖాయం. ఇదిలా ఉండగా మొయినాబాద్ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం అధికం. ఈ క్రమంలోనే సదరు అభ్యర్థి ఇంతలా ఖర్చు చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions