Sunday 1st March 2026
12:07:03 PM
Home > తాజా > రేవంత్-కేసీఆర్ ఫేస్ టు ఫేస్..ఏం జరగబోతుందో!

రేవంత్-కేసీఆర్ ఫేస్ టు ఫేస్..ఏం జరగబోతుందో!

cm revanth meets kcr

CM Revanth Reddy vs KCR | శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం, బీఆరెస్ అధినేత కేసీఆర్ మధ్య ఎలాంటి వాడివేడి చర్చ జరగనుందో అని విస్తృతంగా చర్చ నడుస్తోంది. సోమవారం నుంచి రాష్ట్ర శీతాకాల శాసనసభ సమావేశాలు మొదలవనున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం సిద్దిపేట జిల్లాలోని ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి బయలుదేరిన కేసీఆర్ జూబ్లీహిల్స్ నందినగర్ లోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ క్రమంలో సోమవారం జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ దాదాపు హాజరవడం ఖాయం అయ్యింది. ఇటీవల ఎర్రవల్లి ఫార్మహౌస్ లో ఉమ్మడి మహబూబ్నగర్, నల్గొండ, రంగారెడ్డికి చెందిన తమ పార్టీ నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా తాను అసెంబ్లీ సమావేశాలకు రానున్నట్లు చెప్పారు. అధికార పక్షం ఎలాంటి ఎజెండాను ఖరారు చేస్తుందో చూసి ముందుకు వెల్దామని పేర్కొన్నట్లు సమాచారం. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో అసెంబ్లీలో మరియు ప్రజాక్షేత్రంలో పోరాడుతాం అని కేసీఆర్ ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ధీటుగా కాస్త ఘాటుగానే బదులిచ్చారు. అసెంబ్లీకి వస్తే ఏ అంశంపై అయినా చర్చించడానికి సిద్ధం అన్నారు. ఈ తరుణంలో రేవంత్ రెడ్డి-కేసీఆర్ మధ్య ఎలాంటి డైలాగ్ వార్ జరుగుతుందో అనే ఆసక్తి నెలకొంది.

You may also like
జమ్మూ జయహో..67 ఏళ్ల నిరీక్షణకు తెర!
రాష్ట్రంలో భారీ పేలుడు..భారీగా మృతులు
మెప్పు కోసం గొప్పలకు వెళ్లొద్దు..మంచు సందేశం
ఇరాన్ పై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్..ఏం జరగనుందో!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions