PM Modi meets injured at LNJP Hospital | ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి వెళ్లి బాంబు పేలుడు ఘటన బాధితులను పరామర్శించారు. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట, చాందీని చౌక్ మధ్య ఉన్న రోడ్డుపై సిగ్నల్ వద్ద జరిగిన కారు బ్లాస్ట్ కలకలం రేపింది.
ఈ ఘటనలో క్షతగాత్రులను ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్రమోదీ భూటాన్ పర్యటనను ముగించుకుని భారత్ కు బుధవారం తిరిగి వచ్చారు. నేరుగా ఆయన ఆసుపత్రికి వెళ్లి బాధితులను కలిశారు.
వారి పరిస్థితిని వైద్యులతో అడిగి తెలుసుకున్నారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. అలాగే ఈ కుట్ర వెనుక ఉన్నవారిని చట్టం ముందు నిలబెట్టడం ఖాయం అని ప్రధాని మరోసారి స్పష్టం చేశారు.










