Friday 20th March 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ‘అప్పుడు ఈ సనాతన ధర్మ రక్షకుడు ఎక్కడ’..పవన్ పై అంబటి ఫైర్

‘అప్పుడు ఈ సనాతన ధర్మ రక్షకుడు ఎక్కడ’..పవన్ పై అంబటి ఫైర్

Ambati Rambabu Fires on Pawan Kalyan | ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై నిప్పులుచెరిగారు మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు. వైసీపీ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిని వినియోగించినట్లు సిట్ నిర్ధారించిన విషయం తెల్సిందే.

ఈ నేపథ్యంలో పవన్ స్పందిస్తూ..సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రత్యేకంగా ‘సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు’ అవసరం అని నొక్కిచెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు స్పందించారు.

‘గొప్ప సనాతన యోధుడు పవన్ కళ్యాణ్ చివరకు నిద్ర లేచారు. కానీ న్యాయం కోసం కాదు, సత్యం కోసం కాదు, ధర్మం కోసం కాదు, కేవలం చంద్రబాబు రాజకీయ ప్రచార కోసం డాన్స్ చేయడానికి. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో 6 మంది భక్తులు మరణించినప్పుడు ఈ గొప్ప “ధర్మ రక్షకుడు” ఎక్కడ ఉన్నాడు? సింహాచలంలో 7 మంది ప్రాణాలు కోల్పోయినప్పుడు ఆయన యొక్క ఆగ్రహం ఎక్కడ పోయింది? కాశీబుగ్గలో 9 మంది మరణించినప్పుడు ఈ గొప్ప ధర్మ యోధుడు ఎక్కడ ఉన్నాడు? ఒక్క సందర్శన కూడా చేయలేదు. ఒక్క మాట కూడా లేదు, కనీస సానుభూతి కూడా చూపలేదు. ఆయన దుఃఖంలో ఉన్న కుటుంబాలను కలవలేదు, సంతాపం తెలపలేదు, ఒక ప్రజా నాయకుడి నుండి ఆశించే కనీస మానవత్వాన్ని కూడా చూపించలేదు. విశాఖపట్నంలో టీడీపీ నాయకుడు సుబ్రహ్మణ్య గుప్తా యొక్క కోల్డ్ స్టోరేజ్ నుండి 189,000 కిలోల ఆవు మాంసం స్వాధీనం చేయబడినప్పుడు, స్వయం ప్రకటిత సనాతని మళ్లీ అదృశ్యమయ్యాడు. కానీ నేడు వైసీపీ నవంబర్ 12 నుంచి వైద్య కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీలకు సిద్దమైన తరుణంలో, పవన్ అకస్మాత్తుగా మేల్కొని చంద్రబాబు స్క్రిప్టు ను అమలు చేస్తున్నాడు’ అని అంబటి ఫైర్ అయ్యారు.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions