Wednesday 18th March 2026
12:07:03 PM
Home > తాజా > రూ.15 వేల కోట్ల భూమి కోసం..హైడ్రా ఆపరేషన్

రూ.15 వేల కోట్ల భూమి కోసం..హైడ్రా ఆపరేషన్

Hydra operation launched in Gajularamaram | రూ.15 వేల కోట్ల విలువ చేసే భూమి కోసం ఆపరేషన్ చేపట్టినట్లు హైడ్రా తెలిపింది. ఈ మేరకు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారంలో ఆక్రమణలను హైడ్రా తొలగించింది.

సర్వే నంబర్ 307 లో 300 ఎకరాలకు పైగా ఉన్న భూమిలో ఆక్రమణలు జరిగినట్లు హైడ్రా పేర్కొంది. రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ కు కేటాయించిన భూమిలో బడా బాబులు ఆక్రమణలు చేపట్టినట్లు ఇందులో రాజకీయ నాయకులు, అధికారులు కూడా ఉన్నారని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ఎకరాల్లో వెంచర్లు వేసి ప్లాట్లుగా విక్రయాలు చేసినవారిపై చర్యలు చేపట్టినట్లు వివరించారు.

పేదవారిని ముందు పెట్టి..బడాబాబులు షెడ్డుల వేయించారని వాటిని తొలగిస్తున్నట్లు చెప్పారు. అయితే పేదలు నివసిస్తున్న ప్రాంతాలను కాకుండా వాణిజ్య షెడ్లు, కాంపౌండ్ గోడలను తొలగిస్తున్నట్లు తెలిపారు.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions