Seethakka Ties Rakhee to Ministers | రాఖీ పౌర్ణమి (Rakhee Pournami) సందర్భంగా శనివారం రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క (Minister Seethakka) పలువురు నేతలకు రాఖీలు కట్టారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఏఐసిసి సెక్రెటరీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల సహా ఇంచార్జి విశ్వనాథన్, ఏఐసిసి తెలంగాణ పూర్వ ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రే, తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీం తదితరులకు మంత్రి సీతక్క రాఖీ కట్టారు.
ఈ సందర్భంగా ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకుని రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సీతక్క తనకు సొంత సోదరి లాగా అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన ఆప్యాయతను వ్యక్తం చేశారు.










