Tuesday 17th March 2026
12:07:03 PM
Home > క్రీడలు > ఇది టెస్టు క్రికెట్ వైభవం..టీం ఇండియా విజయంపై సత్య నాదెళ్ల

ఇది టెస్టు క్రికెట్ వైభవం..టీం ఇండియా విజయంపై సత్య నాదెళ్ల

Microsoft CEO Satya Nadella hails India vs England Oval Test thriller | అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్ తో జరిగిన ఐదు టెస్టు మ్యాచుల సిరీస్ 2-2 తో డ్రాగా ముగిసింది.

చివరి టెస్టు చివరి రోజు ఆటలో భారత ఆటగాళ్లు ప్రత్యేకంగా మహమ్మద్ సిరాజ్ అద్భుతమైన ప్రదర్శన చేయడంతో కేవలం ఆరు పరుగుల తేడాతో భారత్ విజయాన్ని కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో సిరీస్ సమం అవ్వడంతో ఇరు జట్ల కెప్టెన్లు బెన్ స్టోక్స్, శుభమన్ గిల్ సంయుక్తంగా ట్రోఫీని అందుకున్నారు.

ఈ క్రమంలో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల స్పందించారు. ’25 రోజులు. 5 సమరాలు. 2-2తో సమం. ఇది కేవలం ఆట కాదు. ఇది టెస్ట్ క్రికెట్, దాని శాశ్వతమైన వైభవానికి ప్రతీక. ఒక అద్భుతమైన సిరీస్. డ్రామా, ధైర్యం, మరియు గొప్పతనం ప్రదర్శించిన భారత్-ఇంగ్లాండ్ జట్లకు హాట్స్ ఆఫ్’ అని సత్య నాదెళ్ల పేర్కొన్నారు.

కాగా ఈ టెస్టు సిరీస్ జరిగిన తీరు పట్ల ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి. టెస్టు ఫార్మాట్ కు ఆదరణ తగ్గుతున్న సమయంలో ఇలాంటి ఉత్కంఠభరితమైన మ్యాచులు తిరిగి ఈ ఫార్మాట్ ను అగ్ర స్థానంలో నిలిపేందుకు దోహద పడుతున్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions