Wednesday 18th June 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ‘చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా చంద్రబాబు తీరు’

‘చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా చంద్రబాబు తీరు’

Ys Jagan News | ముఖ్యమంత్రి చంద్రబాబు పై నిప్పులు చెరిగారు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్. కనీస మద్దతు ధరలు లభించక రాష్ట్రంలో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా చంద్రబాబు వారి గోడు పట్టించుకోవడం లేదని జగన్ విమర్శించారు.

కనీస మద్దతు ధరలు లభించక, పెట్టిన పెట్టుబడులూ రాక రైతులు అప్పుల ఊబిలోకి కూరుకు పోతున్నారని తెలిపారు. చంద్రబాబు, మంత్రులు, యంత్రాంగం కనీసం వారివైపు కన్నెత్తికూడా చూడకపోవడం ధర్మమేనా? అని ప్రశ్నించారు. మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు ఇలా ఏ పంట చూసినా కనీస మద్దతు ధరలు రావడం లేదని చొరవ చూపి, మార్కెట్లో జోక్యం చేసుకోవాలన్న కనీస బాధ్యతను విస్మరించారని తెలిపారు.

ధాన్యం, కోకో, పొగాకు, ఆక్వా రైతులు ఆయా జిల్లాల్లో ఆందోళనలు చేస్తుంటే, ఇప్పటికీ రోమ్‌ చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జనాభాలో 60శాతం మంది ప్రజలు ఆధారపడే వ్యవసాయరంగాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల అది తీవ్ర సంక్షోభానికి దారితీస్తే, లక్షల మంది ఉపాధికి గండిపడితే దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? అని నిలదీశారు.

వెంటనే ప్రభుత్వం తరఫున మార్కెట్లో జోక్యం చేసుకోవాలని, కనీస ధరలు లభించని పంటల విషయంలో ప్రభుత్వమే జోక్యంచేసుకుని, మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేయాలని జగన్ డిమాండ్‌ చేశారు.

You may also like
విమాన ప్రమాద స్థలంలో బంగారం సేకరించి..మానవత్వం చాటుకుని
‘కేసీఆర్, జగన్ కలిసి..నేనూ ఫోన్ ట్యాపింగ్ బాధితురాలినే’
‘యుద్ధం మొదలైంది’..ట్రంప్ vs ఖమేని
‘మీ ప్రమేయం లేదు’..డోనాల్డ్ ట్రంప్ కు తేల్చి చెప్పిన మోదీ

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions