Friday 1st May 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ‘మోదీ గారు నాకో సూసైడ్ బాంబు ఇవ్వండి పాక్ తో యుద్ధం చేస్తా’

‘మోదీ గారు నాకో సూసైడ్ బాంబు ఇవ్వండి పాక్ తో యుద్ధం చేస్తా’

Karnataka minister offers to become suicide bomber in a war on Pakistan | కర్ణాటక మంత్రి, కాంగ్రెస్ నాయకులు జమీర్ అహ్మద్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనుమతి ఇస్తే తాను పాకిస్థాన్ తో యుద్ధం చేయడానికి సిద్ధమని మంత్రి ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ‘నేను ముస్లింని, కానీ దానికంటే ముందు భారతీయుడ్ని. పాకిస్థాన్ మనకు చిరకాల శత్రువు.

పాక్ తో ఎలాంటి సంబంధాలు లేవు. ఒకవేళ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా అనుమతి ఇస్తే పాక్ తో యుద్ధం చేయడానికి నేను సిద్ధం. మోదీ, అమిత్ షా నాకు ఒక సూసైడ్ బాంబు ఇస్తే దాన్ని శరీరానికి చుట్టుకుని పాకిస్థాన్ పై దాడి చేయడానికి కూడా సిద్ధమే.

నేను సరదాగా మాట్లాడడం లేదు, దేవుడి మీద ఒట్టు’ అంటూ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో మంత్రి జమీర్ అహ్మద్ ఈ వ్యాఖ్యలు చేశారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions