Saturday 31st January 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ‘ప్రధాని మోదీని తిట్టలేదు’

Cm Revanth Reddy News Latest | తాను ప్రధాని మోదీ ( Pm Modi )ని వ్యక్తిగతంగా దూషించలేదని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

శనివారం సీఎం ఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ( Rahul Gandhi )తో భేటీ అయ్యారు. సుమారు గంటసేపు జరిగిన ఈ భేటీలో కులగణన, ఎస్సి వర్గీకరణ అంశాలపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా మోదీ పుట్టుకతో బీసీ ( BC ) కాదు అని మాత్రమే తాను అన్నట్లు, మోదీని వ్యక్తిగతంగా తిట్టలేదని సీఎం పేర్కొన్నారు. ప్రధాని పై గౌరవం ఉందన్నారు.

తన మాటలని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి ( Kishan Reddy ), బండి సంజయ్ ( Bandi Sanjay ) వక్రీకరించారని విమర్శించారు. పుట్టుకతో మోదీ బీసీ కాదు కాబట్టే ఆయనకు బీసీల పట్ల చిత్త శుద్ధి లేదన్నారు. చిత్త శుద్దే ఉంటే జనగనణలో భాగంగా కుల గణన కూడా చేయాలని డిమాండ్ చేశారు.

You may also like
‘లేడికి-లేడి గెటప్ కు తేడా తెలీదా’..జగన్ కు కమెడియన్ కౌంటర్
పాడి కౌశిక్ పై ఎంఐఎం, ఐపీఎస్ సంఘం తీవ్ర ఆగ్రహం
ఖమ్మం మంత్రిపై వైఎస్ జగన్ కు ఫిర్యాదు
social media code for govt servants
వారు సోషల్ మీడియా వాడాలంటే అనుమతి తప్పనిసరి.. ఎక్కడంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions