Ayodhya Ram Mandir’s First Anniversary | ఉత్తర్ ప్రదేశ్ ( Uttar Pradesh ) అయోధ్యలో 2024 జనవరి 22న రామమందిరంలో బలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన విషయం తెల్సిందే.
అయితే 2025లో మాత్రం జనవరి 11నే ఆలయ వార్షికోత్సవం జరిగింది. హిందు క్యాలెండర్ ( Hindu Calendar ) ప్రకారం వార్షికోత్సవం నిర్వహించినట్లు అయోధ్య రామాలయ ట్రస్ట్ స్పష్టం చేసింది.
పుష్య మాసంలోని శుక్ల పక్ష ద్వాదశి నాడు గతేడాది రామమందిరంలో విగ్రహ ప్రతిష్ఠ జరిగింది.విష్ణుమూర్తి దశావతారంలోని రెండవది అయిన కుర్మావతారాన్ని ధరించింది కూడా శుక్ల పక్ష ద్వాదది నాడే. 2025 లో మాత్రం జనవరి 11నే శుక్ల పక్ష ద్వాదశి వచ్చింది.
హిందు క్యాలెండర్ ప్రకారం శనివారం నాడు రామమందిర వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ ( Pm Modi ) రామాలయ వార్షికోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు.










