Monday 16th March 2026
12:07:03 PM
Home > తాజా > కిమ్స్ ఆసుపత్రికి అల్లు అర్జున్..శ్రీతేజ్ కు పరామర్శ

కిమ్స్ ఆసుపత్రికి అల్లు అర్జున్..శ్రీతేజ్ కు పరామర్శ

Allu Arjun Met Sri Tej In KIMS | నటుడు అల్లు అర్జున్ ( Allu Arjun )మంగళవారం సికింద్రాబాద్ లోని కిమ్స్ దవాఖానకు వెళ్లారు.

డిసెంబర్ నాలుగున సంధ్య థియేటర్ ( Sandhya Theater )వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ క్రమంలో ఆయనకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

అయితే ఈ ఘటనపై కేసు నమోదైన క్రమంలో బాలుడి పరామర్శకు వెళ్ళొద్దన్ని లీగల్ టీం ( Legal Team ) చెప్పడంతో తాను ఆసుపత్రికి వెళ్ళలేదని అల్లు అర్జున్ గతంలోనే చెప్పారు. తాజగా పోలీసులకు సమాచారం ఇచ్చి హాస్పిటల్ కు చేరుకున్నారు.

తెలంగాణ ఎఫ్డీసీ ఛైర్మన్ ( FDC Chairman ) దిల్ రాజుతో కలిసి లోపలికి వెళ్లారు. సుమారు 20 నిమిషాలు ఆసుపత్రిలో ఉన్న అల్లు అర్జున్ శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని, చికిత్స వివరాలను వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు.

అనంతరం శ్రీతేజ్ తండ్రి భాస్కర్ తో మాట్లాడి భరోసా ఇచ్చారు. అల్లు అర్జున్ రాకతో ఆసుపత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions