Saturday 31st January 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > తొలిసారి పోటీ..ప్రియాంక గాంధీ ప్రభంజనం

తొలిసారి పోటీ..ప్రియాంక గాంధీ ప్రభంజనం

Wayanad Parliament By-Elections News | కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ ప్రభంజనం సృస్టిస్తున్నారు.

కేరళ వయనాడ్ ( Wayanad )పార్లమెంటు ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రియాంక గాంధీ తిరుగులేని విజయం దిశగా దూసుకెళ్తున్నారు. 4 లక్షల ఓట్ల మెజారిటీ దిశగా ఆమె దూసుకెళ్తున్నారు.

గత ఎన్నికల్లో వయనాడ్ నుండి పోటీచేసిన రాహుల్ గాంధీ 3.64 లక్షల మెజారిటీని దక్కించుకున్నారు. అయితే ప్రియాంక గాంధీ మాత్రం రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) మెజారిటీని సైతం దాటేశారు.

ఓ వైపు మహారాష్ట్ర ( Maharastra ) ఎన్నికల ఫలితాలతో డీలా పడిన కాంగ్రెస్ శ్రేణులు, ప్రియాంక ఘన విజయం సాధించే దిశగా వెళ్తుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.కాగా గత దశాబ్ద కాలం నుండి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న ప్రియాంక గాంధీ, తొలిసారి వయనాడ్ ఉప ఎన్నికల్లో పోటీ చేశారు.

You may also like
కోఠిలో కాల్పులు..ఇదీ జరిగింది!
చర్యలు తీసుకోండి..పవన్ కు బిడ్డను కోల్పోయిన మహిళ వినతి
ఈ సైకిల్ పై బాబు రయ్ రయ్!
ఎన్నికల బరిలో గల్వాన్ వీరుడు సంతోష్ బాబు తల్లి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions