Tuesday 15th September 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > సీఎం అయిన నెలరోజులకే విడిపోదాం అన్నాడు

సీఎం అయిన నెలరోజులకే విడిపోదాం అన్నాడు

Ys Sharmila Open Letter To YSR Fans | మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ( Ys Rajashekar Reddy ) అభిమానులకు ఏపీ కాంగ్రెస్ ( AP Congress ) చీఫ్ షర్మిల బహిరంగ లేఖను రాశారు.

రాజశేఖర్ రెడ్డి బ్రతికి ఉన్నంత కాలం నలుగురు గ్రాండ్ చిల్డ్రన్ ( Grand Children ) తనకు సమానం అని, అన్ని కుటుంబ వ్యాపారాల్లో ఆ నలుగురికి సమాన వాటా ఉండాలని చెప్పినట్లు లేఖలో షర్మిల ప్రస్తావించారు.

వైఎస్సార్ ( YSR ) బ్రతికి ఉన్నప్పుడు స్థాపించిన అన్ని కుటుంబ వ్యాపారాలకు జగన్ కేవలం గార్డియన్ ( Gaurdian ) మాత్రమే నని పేర్కొన్నారు. ఆస్తులను సమానంగా పంచిపెట్టడమే జగన్ బాధ్యత అని అన్నారు. స్వార్జితం అని జగన్ చెప్పుకుంటున్న ఆస్థులన్నీ కుటుంబ ఆస్తులేనని తెలిపారు.

2019లో అన్న జగన్ ముఖ్యమంత్రి అయ్యాకా గుర్తుపట్టలేనంతగా మారిపోయారని షర్మిల ఆరోపించారు. చిన్నచూపు చూడడమే కాకుండా సీఎం అయిన నెలరోజులకే విడిపోదాం అని ఇజ్రాయిల్ ( Israel ) పర్యటనలో భాగంగా ప్రతిపాదన పెట్టినట్లు చెప్పారు. తాను 60 శాతం తీసుకుంటా నీకు 40 శాతం ఇస్తా అని జగన్ చెప్పినట్లు షర్మిల వెల్లడించారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions