Sunday 2nd August 2026
12:07:03 PM
Home > తాజా > కొండా సురేఖకు మరో బిగ్ షాక్

కొండా సురేఖకు మరో బిగ్ షాక్

KTR Files Defamation Case On Konda Surekha | బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) ను విమర్శించే క్రమంలో మంత్రి కొండా సురేఖ ( Konda Surekha ) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి.

ఈ వ్యాఖ్యల నేపథ్యంలో నటుడు అక్కినేని నాగార్జున ( Akkineni Nagarjuna ) నాంపల్లి కోర్టులో క్రిమినల్ ( Criminal ) పరువునష్టం దావా వేసిన విషయం తెల్సిందే. ఇదిలా ఉండగా మంత్రి కొండా సురేఖకు మరో బిగ్ షాక్ తగిలింది.

కొండా సురేఖపై కేటీఆర్ నాంపల్లి ప్రత్యేక కోర్టులో గురువారం పరువునష్టం దావా వేశారు. కేటీఆర్ తరఫున న్యాయవాది ఉమామహేశ్వరరావు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బీఆరెస్ నేతలు బాల్క సుమన్ ( Balka Suman ), దాసోజు శ్రవణ్, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, తుల ఉమను సాక్ష్యులుగా పేర్కొన్నారు.

మరోవైపు నాగార్జున దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions