Wednesday 18th June 2025
12:07:03 PM
Home > తాజా > కొండ సురేఖ పై పరువునష్టం కేసు..నాంపల్లి కోర్టుకు నాగార్జున

కొండ సురేఖ పై పరువునష్టం కేసు..నాంపల్లి కోర్టుకు నాగార్జున

Nagarjuna to Appear in Nampally Court | మాజీ మంత్రి కేటీఆర్ ( KTR ) ను విమర్శించే క్రమంలో ప్రముఖ నటుడు నాగార్జున ( Akkineni Nagarjuna ), నటి సమంతా ( Samantha ) పై మంత్రి కొండా సురేఖ ( Minister Konda Surekha ) చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి.

ఈ నేపథ్యంలో మంత్రి సురేఖ పై నాగార్జున రూ.100 కోట్ల క్రిమినల్ పరువునష్టం దావా వేశారు. ఈ పిటిషన్ ( Petition ) కు సంబందించి సోమవారం నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది.

అక్కినేని కుటుంబం గౌరవం, ప్రతిష్ట దెబ్బతీసేలా మంత్రి వ్యాఖ్యలు ఉన్నాయని నాగార్జున పేర్కొన్నారు. సోమవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం మంగళవారం నాగార్జున వాంగ్మూలం నమోదు చేయాలని పేర్కొంది.

ఈ క్రమంలో నేడు నాంపల్లి కోర్టు ( Nampally Court )కు నాగార్జున వెళ్లనున్నారు. మధ్యాహ్నం తరువాత నాగార్జున వాంగ్మూలాన్ని రికార్డు చేయనున్నారు. నాగార్జున తో పాటు మిగతా సాక్ష్యుల స్టేట్మెంట్ ( Statement ) ను కూడా కోర్టు రికార్డ్ చేయనుంది.

You may also like
విమాన ప్రమాద స్థలంలో బంగారం సేకరించి..మానవత్వం చాటుకుని
‘కేసీఆర్, జగన్ కలిసి..నేనూ ఫోన్ ట్యాపింగ్ బాధితురాలినే’
‘యుద్ధం మొదలైంది’..ట్రంప్ vs ఖమేని
‘మీ ప్రమేయం లేదు’..డోనాల్డ్ ట్రంప్ కు తేల్చి చెప్పిన మోదీ

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions