Thursday 19th September 2024
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > “కళ్ళల్లోకి కారం కొట్టి కిరాతకంగా హతమార్చారు “: మంత్రి లోకేశ్

“కళ్ళల్లోకి కారం కొట్టి కిరాతకంగా హతమార్చారు “: మంత్రి లోకేశ్

Nara Lokesh

Minister Nara Lokesh | కర్నూల్ (Kurnool) జిల్లా పత్తికొండ మండలం హోసూరులో టీడీపీ నేత వాకిటి శ్రీనివాసులు (Vakiti Srinivasulu) దారుణ హత్యకు గురయ్యారు. బుధవారం ఉదయం ఆయన కళ్ళల్లో కారం చల్లి దారుణంగా హతమార్చారు.

ఈ నేపథ్యంలో స్పందించిన మంత్రి నారా లోకేశ్ వైసీపీ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ హత్య వైసీపీ మూకల పనే అంటూ మంత్రి ఆరోపించారు. అలాగే ఈ హత్యను తీవ్రంగా ఖండించారు.

” ఎన్నికల్లో టీడీపీ తరఫున కీలకంగా పనిచేశాడనే కక్షతో శ్రీనివాసులు కళ్ళల్లోకి కారం కొట్టి కిరాతకంగా హతమార్చారు. ప్రజాక్షేత్రంలో తిరస్కారానికి గురైనప్పటికీ జగన్ అండ్ కో తమ పాత పంథా మార్చుకోకుండా ఇటువంటి దురాగతాలకు పాల్పడుతున్నారు.

తెలుగుదేశం శ్రేణుల సహనాన్ని చేతగానితనంగా భావిస్తూ, ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడే వారిపై ప్రజా ప్రభుత్వం  కఠినంగా వ్యవహరిస్తుంది. వైసీపీ మూకల చేతిలో బలైన శ్రీనివాసులు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుంది. ” అని లోకేశ్ ట్వీట్ చేశారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions