Thursday 1st May 2025
12:07:03 PM
Home > తాజా > రూ.50 కోట్లకు పీసీసీ పదవి..కేటీఆర్ కు నోటీసులు!|

రూ.50 కోట్లకు పీసీసీ పదవి..కేటీఆర్ కు నోటీసులు!|

Defamation Notice To Ktr| మాజీ మంత్రి, బీఆరెస్ ( Brs ) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( Ktr ) కు పరువునష్టం కింద నోటీసులు పంపారు కాంగ్రెస్ ( Congress ) ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఇంచార్జ్ ( Incharge ) మానిక్కం ఠాగూర్ ( Manickam Tagore ).

గత ఆదివారం సిరిసిల్ల ( Sircilla ) లో నిర్వహించిన బీఆరెస్ మీటింగ్ లో మాట్లాడిన కేటీఆర్..రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) అప్పటి తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మానిక్కం ఠాగూర్ కు రూ.50 కోట్లు ఇచ్చి పీసీసీ పదవిని తెచ్చుకున్నారని ఆరోపించారు.

ఈ నేపథ్యంలో స్పందించిన మానిక్కం ఠాగూర్ పరువునష్టం ( Defamation ) నోటీసులు పంపారు. కేసీఆర్ ( Kcr )కొడుకుకు పరువు నష్టం నోటీసులు పంపడం జరిగిందని తెలిపారు మానిక్కం.

అలాగే “బహుశా అతను ఫార్మ్ హౌస్ ( Farm House ) వినోదాలలో మునిగిపోయి ఉండవచ్చు. ఈ నోటీసులపై 7 రోజుల్లో స్పందించకపోతే, మేము కోర్టుకు వెళ్తాము” అని స్పష్టం చేశారు ఆయన.

ఇదిలా ఉండగా గతంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ప్రస్తుత బీఆరెస్ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి ( Sudheer Reddy ), కౌశిక్ రెడ్డి ( Koushik Reddy ) లపై కూడా పరువునష్టం దావా వేశారు మానిక్కం.ఈ కేసుకు సంబంధించి ఇద్దరు బీఆరెస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే ఒకసారి మధురై ( Madurai ) కోర్టులో హాజరు కూడా అయ్యారు.

You may also like
tg ssc results
పదో తరగతి ఫలితాల్లో ఈ జిల్లా టాప్!
tgsrtc
నిజాయతీ చాటుకున్న కండక్టర్ కు సన్మానం!
cm revanth reddy
కేసీఆర్ ప్రసంగంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఏమన్నారంటే!
cm revanth meets jana reddy
జానా రెడ్డితో సీఎం రేవంత్ భేటి.. కారణం ఏంటంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions