Tuesday 17th March 2026
12:07:03 PM
Home > క్రీడలు > ఇండియా-న్యూజిలాండ్ సెమీస్ మ్యాచ్ కు బెదిరింపులు..!

ఇండియా-న్యూజిలాండ్ సెమీస్ మ్యాచ్ కు బెదిరింపులు..!

Threat Message Ahead Of India Vs New Zealand Match| ఇండియా – న్యూజిలాండ్ ( India Vs New Zealand ) మ్యాచ్ సందర్భంగా దారుణమైన ఘటనలు చోటుచేసుకుంటాయని బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. ఒక గుర్తు తెలియని ఆగంతకుడు ‘ఎక్స్’ ( X ) (ట్విట్టర్) లో ముంబై ( Mumbai ) పోలీసులకు బెదిరింపులతో కూడిన మెసేజ్ ( Message ) ను పంపించాడాని తెలిపారు పోలీసు అధికారులు.

వరల్డ్ కప్ ( World Cup ) లో భాగంగా బుధవారం నాడు ఇండియా – న్యూజిలాండ్ జట్ల మధ్య సెమి ఫైనల్ ( Semi-Final ) మ్యాచ్ జరగనుంది. ముంబాయి లోని వాంఖేడే స్టేడియం ( Wankhede Stadium ) వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ మొదలుకానుంది.

ఇండియా న్యూజిలాండ్ ల మధ్య జరగనున్న తొలి సెమీస్ కు ఫూట్ బాల్ ( Foot Ball ) స్టార్ డేవిడ్ బెహ్రామ్ ( David Beckham ), సూపర్ స్టార్ రజినీకాంత్, బాలీవుడ్ అగ్ర హీరోలు సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, నీతా అంబానీ, హార్దిక్ పాండ్యా ( Hardik Pandya ) తదితరులు ముఖ్య అతిధులుగా హాజరవ్వనున్నారు.

కాగా ఈ మ్యాచ్ ( Match ) సందర్భంగా దారుణమైన ఘటనలు చోటుచేసుకుంటాయని బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది.

ముంబై పోలీసులకు ఎక్స్ లో దారుణమైన ఘటనలు చోటుచేసుకుంటాయని, తుపాకీ, హ్యాండ్ గ్రనేడ్ ( Hand Grenade ) బుల్లెట్ ఉన్న ఫోటోలను పోస్ట్ చేసి ముంబాయి పోలీసులను ట్యాగ్ చేసాడు సదరు ఆగంతకుడు.

ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు స్టేడియం వద్ద హై అలెర్ట్ ( High Alert ) ను ప్రకటించి, కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. అలాగే స్టేడియం పరిసర ప్రాంతాల్లో గట్టి నిఘాను ఏర్పాటు చేశారు.

కాగా ఈ బెదిరింపు మెసేజ్ కు సంబంధించి మహారాష్ట్ర లోని లతూర్ ( Latur ) జిల్లాకు చెందిన 17 ఏళ్ల యువకుడిని అదుపులోకి తీసుకున్నారు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.

You may also like
టీం ఇండియాకు టాస్ గండం..రెండేళ్లు అయినా
kohli retirement
రెడ్ బాల్ గేమ్ కు గుడ్ బై.. కొహ్లీ ఎమోషనల్ పోస్ట్!
‘ముంబై ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..ఆర్సీబీ మ్యాచ్ కు బుమ్రా’
రికీ పాంటింగ్ కు గంభీర్ కౌంటర్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions