- షార్కు చేరుకున్న ఇస్రో అధిపతి
చంద్రయాన్-3 ప్రయోగానికి తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) సిద్ధమైంది. గురువారం మధ్యాహ్నం 2:35:13 గంటలకు కౌంట్డౌన్ ప్రక్రియ ప్రారంభమై 24 గంటలు కొనసాగనుంది.
అనంతరం శుక్రవారం మధ్యాహ్నం 2:35:13 గంటలకు రెండో ప్రయోగ వేదిక నుంచి ఎల్వీఎం-3పీ4 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.
షార్కు చేరుకున్న ఇస్రో అధిపతి డా.సోమనాథ్.. వాహకనౌకను పరిశీలించారు. అనంతరం భాస్కరా అతిథి భవనానికి చేరుకుని శాస్త్రవేత్తలతో సమీక్షించారు.
చంద్రయాన్-3 ఉపగ్రహ ప్రాజెక్టు డైరెక్టర్ వీరముత్తువేల్, ఎల్వీఎం-3పీ4 మిషన్ డైరెక్టర్ ఎస్.మోహన్కుమార్, అసోసియేట్ మిషన్ డైరెక్టర్ నారాయణన్, వెహికల్ డైరెక్టర్ బిజూస్ థామస్ ఉన్నారు.
చంద్రయాన్-3 ప్రయోగం భారతదేశ అంతరిక్ష కార్యక్రమానికి ఒక ముఖ్యమైన మైలురాయి. చంద్రుని గురించి మరియు దాని చరిత్ర గురించి మరింత తెలుసుకోవడానికి ఈ మిషన్ భారతదేశానికి సహాయం చేస్తుంది.
భవిష్యత్తులో చంద్రుని మిషన్ల కోసం కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి ఇది భారతదేశానికి సహాయపడుతుంది.