Saturday 2nd May 2026
12:07:03 PM
Home > తాజా > రైతు దినోత్సవం నాడే అన్నదాత అవయవదానం..ఐదుగురికి ప్రాణత్యాగం

రైతు దినోత్సవం నాడే అన్నదాత అవయవదానం..ఐదుగురికి ప్రాణత్యాగం

74 Year Old Farmer Save’s Five Peoples Lives By Donating Organs | జాతీయ రైతు దినోత్సవం నాడే ఓ అన్నదాత అవయవదానం చేసి ఐదుగురి ప్రాణాలను కాపాడారు.

ఈ విషయాన్ని తెలంగాణ జీవన్ దాన్ తెలిపింది. మహబూబ్నగర్ జిల్లా అమనగల్ మండలం ముద్విన్ గ్రామానికి చెందిన 74 ఏళ్ల పుట్టి జంగయ్య ఓ రైతు. అయితే డిసెంబర్ 19న అపస్మారక స్థితిలో ఇంట్లో ఒక్కసారిగా పడిపోయారు.

దింతో ఆయన్ను కుటుంబసభ్యులు హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే డిసెంబర్ 23న జంగయ్య బ్రెయిన్ డెడ్ అయి మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు. ఇదే సమయంలో జీవన్ దాన్ ప్రతినిధులు జంగయ్య కుటుంబ సభ్యులను కలిసి అవయవదానం విశిష్టతను వివరించారు.

ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు అవయవదానానికి అంగీకరించారు. ఈ క్రమంలో జంగయ్య శరీరం నుండి కాలేయం, రెండు మూత్రపిండాలు, రెండు కార్నియాలు సేకరించి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఐదుగురికి అమర్చారు.

జంగయ్య అవయవదానం చేసిన సోమవారం నాడే జాతీయ రైతు దినోత్సవం. అవయవదానం చేసి రైతే రాజు అని జంగయ్య నిరూపించారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions