Sunday 2nd August 2026
12:07:03 PM
Home > తాజా > నయనతారపై కోర్టు మెట్లెక్కిన ధనుష్

నయనతారపై కోర్టు మెట్లెక్కిన ధనుష్

Dhanush Sues Nayanthara Before Madras Court | కోలీవుడ్ ( Kollywood ) లో నటి నయనతార మరియు నటుడు ధనుష్ మధ్య మొదలైన వివాదం కోర్టుకు చేరింది. నయనతార, ఆమె భర్త దర్శకుడు విగ్నేష్ ( Director Vignesh ) పై మద్రాస్ హైకోర్టులో ధనుష్ దావా వేశారు.

నయనతార జీవితం ఆధారంగా ‘ నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ ‘ డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్ ( Netflix ) లో విడుదలైన విషయం తెల్సిందే. అయితే తన పేర్మిషన్ లేకుండా నానుమ్ రౌడీ దాన్ మూవీ విజువల్స్ ను వాడుకోవడం పట్ల ధనుష్ నిర్మాణ సంస్థ కోర్టును ఆశ్రయించింది.

నయనతార, విఘ్నేష్ మరియు వారికి చెందిన రౌడీ పిక్చర్స్ ( Rowdy Pictures ) పై దావా వేశారు. బుధవారం పిటిషన్ ను పరిశీలించిన ధర్మాసనం, విచారణకు అంగీకరించింది. కాగా నానుమ్ రౌడీ దాన్ మూవీ షూటింగ్ ( Shooting ) సమయంలోనే తొలిసారి నయనతార, విఘ్నేష్ కలుసుకున్నారు.

ఈ క్రమంలో తమకు ఎంతో ప్రత్యేకం అయిన నానుమ్ రౌడీ దాన్ మూవీ విజువల్స్ ను డాక్యుమెంటరీలో చూపించేందుకు పర్మిషన్ అడిగినా మూవీ నిర్మాత ధనుష్ అంగీకరించలేదని నయనతార ఒక బహిరంగ లేఖను విడుదల చేసిన విషయం తెల్సిందే. ఈ సందర్భంగా ధనుష్ క్యారెక్టర్ పై ఆమె సంచలన ఆరోపణలు చేశారు.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions