Monday 19th May 2025
12:07:03 PM
Home > తాజా > కులాంతర వివాహం..కానిస్టేబుల్ అక్కని నరికి చంపిన తమ్ముడు

కులాంతర వివాహం..కానిస్టేబుల్ అక్కని నరికి చంపిన తమ్ముడు

Constable Nagamani News | రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో దారుణం చోటుచేసుకుంది. కులాంతర వివాహం చేసుకుందనే కారణంతో అక్కను అత్యంత కిరాతకంగా తమ్ముడు హతమార్చాడు.

సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం..నాగమణి హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. గతంలో ఆమెకు వివాహం జరగగా, పది నెలల క్రితం విడాకులు తీసుకున్నారు.

అనంతరం నవంబర్ 1న రాయపోలు గ్రామానికి చెందిన శ్రీకాంత్ ను యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకున్నారు. వీరిది కులాంతర ప్రేమ వివాహం. ఆదివారం సెలవు కావడంతో నాగమణి దంపతులు రాయపోలు గ్రామానికి వెళ్లారు.

సోమవారం తిరిగి హయత్ నగర్ వస్తుండగా ఎండ్లగూడ వెళ్లే రహదారిపై కారుతో ఢీ కొట్టి అనంతరం వేట కొడవలితో నరికేశారు. సోదరి కులాంతర వివాహం చేసుకోవడం జీర్ణించుకోలేని సోదరుడే ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు.

You may also like
క్యాన్సర్ బారిన పడిన వ్యక్తికి అండగా సీఎం
‘జల్సాల కోసం రూ.172 కోట్లతో హెలికాప్టర్’..YCP vs TDP
‘భారీగా పెరిగిన WTC ప్రైజ్ మనీ..ఎన్ని రూ.కోట్లంటే!’
పురుషులపై ఆసక్తి లేదు..పెళ్లి చేసుకున్న ఇద్దరు యువతులు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions