Monday 5th May 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ఆపరేషన్ బుడమేరు..వారిని హెచ్చరించిన సీఎం చంద్రబాబు

ఆపరేషన్ బుడమేరు..వారిని హెచ్చరించిన సీఎం చంద్రబాబు

Cm Chandrababu ON Operation Budameru | త్వరలోనే ఆపరేషన్ బుడమేరు ( Operation Budameru ) ప్రారంభించనున్నట్లు సీఎం చంద్రబాబు ( Cm Chandrababu ) ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం బుడమేరుకు గండ్లు పడిన ఇబ్రహీంపట్నం శాంతినగర్, కవులూరు ప్రాంతాలను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన..బుడమేరు స్థలాలను కబ్జా చేసి, అక్రమ నిర్మాణాలు నిర్మించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, ఆపరేషన్ బుడమేరు మొదలుపెట్టి వాటిని తొలగించనున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు.

రాజకీయ ముసుగు వేసుకున్న నేరస్తులను వదిలే ప్రసక్తే లేదని వార్నింగ్ ( Warning )ఇచ్చారు. మట్టి దోపిడీ చేసి, అడ్డగోలుగా కబ్జాలు చేసి బుడమేరుకు గండ్లు పడేలా చేశారని మండిపడ్డారు.

ఒక్కటీ ముప్పై టన్నుల బరువు ఉండే మూడు పడవలను ప్రకాశం బ్యారేజీలోకి వదిలేశారని, అవి వచ్చిన వేగానికి 15 టన్నుల బరువు ఉండే కౌంటర్ వెయిట్లు రెండు విరిగిపోయినట్లు సీఎం పేర్కొన్నారు. అవే పిల్లర్లను తాకి ఉంటే పెను ప్రమాదం వాటిల్లేదని తెలిపారు.

You may also like
‘కీలక ఒప్పందం..మూడేళ్ళలో 4 లక్షల మందికి శిక్షణ’
‘చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా చంద్రబాబు తీరు’
‘ప్రజల రాజధాని కోసం కేంద్రం సహకారం మరవలేనిది’
‘తాత ఎన్టీఆర్ కల..మనవడు లోకేష్ నెరవేర్చాడు’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions