Chandrababu On Cm Jagan| ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తేవడం ఏంటని సీఎం జగన్ ( Cm Jagan ) ను ప్రశ్నించారు టీడీపీ అధినేత చంద్రబాబు ( Chandrababu ).
” రాష్ట్రానికి ఎంత అవమానకరం…ఎంత బాధాకరం…ఎంత సిగ్గు చేటు జగన్ రెడ్డీ! ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థకు గుండెకాయలాంటి రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తేవడమా? రూ. 370 కోట్లకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చునే భవనాన్ని, ఒక రాష్ట్ర పాలనా కేంద్రాన్ని, తాకట్టు పెట్టడం అంటే ఏంటో ఈ ముఖ్యమంత్రికి తెలుసా? నువ్వు తాకట్టు పెట్టింది కేవలం భవనాలను కాదు….తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని. నువ్వు నాశనం చేసింది సమున్నతమైన ఆంధ్ర ప్రదేశ్ బ్రాండ్ని! ప్రజలారా…అసమర్థ, అహంకార, విధ్వంస పాలనలో మనం ఏం కోల్పోతున్నామో ఆలోచించండి!” అని ఎక్స్ ( X ) వేదికగా పోస్ట్ చేశారు చంద్రబాబు.
” రాష్ట్రాన్ని 12.5లక్షలకోట్ల అప్పుల్లో ముంచిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏకంగా సెక్రటేరియట్ ను తాకట్టుపెట్టాడన్న వార్త చూసి ఉదయాన్నే షాక్ కు గురయ్యాను” అని పేర్కొన్నారు నారా లోకేష్ ( Nara Lokesh ).