Monday 14th September 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > విదేశాల్లో ఉన్నత విద్య.. విద్యార్థులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్!

విదేశాల్లో ఉన్నత విద్య.. విద్యార్థులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్!

AP Govt Good News | విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విదేశాల్లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవాలనే వారికి పావలా వడ్డీకే బ్యాంకు రుణాలు అందించే సరికొత్త పథకాన్ని తీసుకురానున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు.

ఈ పథకం కింద ఎంతమంది విద్యార్థులైనా, ఎలాంటి పరిమితులు లేకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని స్పష్టం చేశారు. దేశంలోని ఐఐటీ, ఐఐఎం, నీట్ లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో చదివే వారికి కూడా ఈ పావలా వడ్డీకే రుణం వర్తింపజేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

సోమవారం సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగ సంక్షేమ శాఖలపై మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విదేశీ విద్యా రుణాలకు 4 శాతం వడ్డీకే బ్యాంకులు రుణాలు ఇచ్చేలా చూడాలని, దానికి ప్రభుత్వమే గ్యారంటీగా ఉంటుందని హామీ ఇచ్చారు. తీసుకున్న రుణాన్ని 14 ఏళ్లలో తిరిగి చెల్లించే వెసులుబాటు కల్పిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.  

You may also like
ఫైళ్ల పరిష్కారంలో జాప్యం వద్దు: సీఎం చంద్రబాబు తీవ్ర హెచ్చరిక!
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions