Sunday 14th June 2026
12:07:03 PM
Home > తాజా > అభివృద్ధి మా విధానం… హిందుత్వం మా నినాదం!

అభివృద్ధి మా విధానం… హిందుత్వం మా నినాదం!

bandi sanjay kumar
  • కేంద్ర నిధులతోనే కరీంనగర్ కార్పొరేషన్ సహా మున్సిపాలిటీల్లో అభివ్రుద్ధి
  • రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో నయాపైసా ఇయ్యలే
  • ఎన్నికల వేళ అభివ్రుద్ధి పనులకు శంకుస్థాపనలతో ప్రజలను నమ్మించేందుకు కాంగ్రెస్ యత్నం
  • బీఆర్ఎస్ కు ఓటేయడం దండగ
  • బీజేపీని ఆశీర్వదించి అత్యధిక స్థానాల్లో గెలిపించండి
  • కేంద్రం నుండి అత్యధిక నిధులతోపాటు సీఎస్సార్ నిధులను తీసుకొస్తా…
  • అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తా
  • కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

Bandi Sanjay Kumar | రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో (Municipal Elections) ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Narendra Modi) ఆధ్వర్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో జరిగిన అభివ్రుద్ధే ఎజెండాగా ప్రజల్లోకి వెళతామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు.

కరీంనగర్ లోని ఎంపీ కార్యాలయంలో జిల్లా పరిషత్ తాజా మాజీ ఛైర్మన్, బీఆర్ఎస్ నేత కనుమల్ల విజయ గణపతి కొద్దిసేపటి క్రితం కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. విజయగణపతి దంపతులిద్దరికీ కాషాయ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

వారితోపాటు జమ్మికుంటకు చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు బీజేపీ కండువా కప్పుకున్నారు. అనంతరం బండి సంజయ్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.  కరీంనగర్ కార్పొరేషన్ సహా తన పార్లమెంట్ నియోజకవర్గంలోని మున్సిపాలిటీల్లో అంతో ఇంతో అభివ్రుద్ధి జరిగిందంటే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులతోనే సాధ్యమైందని తెలిపారు.

స్మార్ట్ సిటీ, అమ్రుత్ 1, 2, స్వచ్ఛ భారత్ వంటి పథకాలతోపాటు 14, 15, 16వ ఆర్ధిక సంఘం విడుదల చేసిన నిధులతోనే కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో అభివ్రుద్ది పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే రాబోయే ఎన్నికల్లో ‘‘అభివ్రుద్దే మా విధానం… హిందుత్వమే మా నినాదం’’ పేరుతో ప్రజల వద్దకు వెళతామని తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండేళ్లలో మున్సిపాలిటీలకు నయాపైసా ఇయ్యలేదని గుర్తు చేశారు. ఎన్నికలు వస్తున్నయని తెలియడంతో ఓట్ల కోసం అభివ్రుద్ధి పనులకు శంకుస్థాపనల పేరుతో కాంగ్రెస్ నేతలు హడావుడి చేసేందుకు సిద్ధమయ్యారని దుయ్యబట్టారు.

అటు  కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలో లేని బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి ఏం లాభమని, గెలిచిన తరువాత పార్టీ ఫిరాయింపులకు పాల్పడతారని పేర్కొన్నారు. ప్రజలు వాస్తవాలు గమనించాలని కోరారు. బీజేపీని ఆశీర్వదించి కరీంనగర్ కార్పొరేషన్ తోపాటు మున్సిపాలిటీల్లో అత్యధిక స్థానాల్లో గెలిపిస్తే కేంద్రం నుండి అత్యధిక నిధులు తీసుకురావడంతోపాటు సీఎస్సార్ నిధులను సైతం తీసుకొచ్చి అభివ్రుద్ధి అంటే ఏమిటో చూపిస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, కరీంనగర్ మాజీ మేయర్ డి.శంకర్, డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేశ్,  బీజేపీ జమ్మికుంట నేతలు ఆకుల రాజేందర్, పుప్పాల రఘు తదితరులు పాల్గొన్నారు.

You may also like
TG Heat Wave Alert
తెలంగాణ ప్రజలకు అలర్ట్.. తప్పనిసరి అయితేనే బయటకు రండి!
modi civic satyagraha call
బీ అలెర్ట్.. ప్రధాని మోదీ ‘సివిక్ సత్యాగ్రహం’ పిలుపు!
bandi sanjay kumar
నేనేం ఫాంహౌస్‌ ఎలుకను కాదు.. బండి సంజయ్ హాట్ కామెంట్స్!
azharuddin and kodandaram as mlc
ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాంప్రమాణ స్వీకారం.. మంత్రి పదవికి వీడిన గండం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions