Thursday 30th April 2026
12:07:03 PM
Home > తాజా > తెలంగాణ అంబాసిడర్ గా మెస్సి..సీఎంతో ప్రత్యేక ఫుట్బాల్ మ్యాచ్ ?

తెలంగాణ అంబాసిడర్ గా మెస్సి..సీఎంతో ప్రత్యేక ఫుట్బాల్ మ్యాచ్ ?

Messi Likely to Be Face of Telangana Rising 2047 Telangana | ప్రపంచంలోనే అత్యధిక అభిమానులు గల ఫుట్బాల్ లెజెండ్, అర్జెంటీనా ప్లేయర్ లియోనల్ మెస్సి డిసెంబర్ నెలలో భారతదేశంలో పర్యటించనున్నారు.

ఇందులో భాగంగా మెస్సి డిసెంబర్ 13న హైదరాబాద్ లో సందడి చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన విషయం వైరల్ గా మారింది. హైదరాబాద్ పర్యటనలో భాగంగా మెస్సి ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం లేదా గచ్చిబౌలి స్టేడియంలో ఓ ఫ్రెండ్లీ ఫుట్బాల్ ఆడే అవకాశం ఉంది.

ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొనే సూచనలు కనిపిస్తున్నాయి. సీఎం స్వయంగా ఫుట్బాల్ కు పెద్ద అభిమాని. ఇటీవల మెస్సి భారత పర్యటనను నిర్వహిస్తున్న ‘గోట్ ఇండియా టూర్-2025’ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. మెస్సి హైదరాబాద్ పర్యటనకు సంబంధించి పోస్టర్ ను విడుదల చేశారు.

మరోవైపు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంగా ప్రభుత్వం తెలంగాణ రైజింగ్-2047 విజన్ ను ప్రకటించిన విషయం తెల్సిందే. ఇందులో భాగంగా అంతర్జాతీయంగా తెలంగాణను ప్రమోట్ చేసేందుకు మెస్సితో ప్రభుత్వం ఓ ఒప్పందం చేసుకొనున్నట్లు కథనాలు వస్తున్నాయి. తెలంగాణ రైజింగ్ కు మెస్సిని గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించాలని ప్రభుత్వం ఆసక్తి కనబరుస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions