Thursday 30th April 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ఢిల్లీ బ్లాస్ట్..అసలేం జరిగిందంటే !

ఢిల్లీ బ్లాస్ట్..అసలేం జరిగిందంటే !

Delhi Car Blast | దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం కారులో అత్యంత తీవ్రతతో ఓ భారీ పేలుడు సంభవించడం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ఢిల్లీలోని ఎర్ర కోట, చాందినీ చౌక్ మధ్యనున్న రోడ్డు మీద సరిగ్గా సిగ్నల్ జంక్షన్ లో నవంబర్ 10, సోమవారం సాయంత్రం 6 గంటల 52 నిమిషాలకు HR 26 CE 7674 నంబర్ గల హ్యుండాయ్ ఐ20 కారులో ఈ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఇప్పటివరకు 12 మంది మృతిచెందారు.

బ్లాస్ట్ జరిగిన సమయంలో తొమ్మిది మంది, ఆ తర్వాత చికిత్స పొందుతూ మరో ముగ్గురు మరణించారు. 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు జరగడానికంటే ముందు ఈ కారు ఎర్ర కోట సమీపంలోని పార్కింగ్ ఏరియాలో సుమారు మూడు గంటలు పార్క్ చేసి ఉంది. సాయంత్రం 3.19 గంటల నుంచి, 6 గంటల 48 నిమిషాల వరకు పార్కింగ్ ఏరియాలో ఉన్న కారు ఆ తర్వాత బయటకు వచ్చి నిదానంగా కదులుతూ రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 వద్ద పేలింది. ఆ వెంటనే సమీపంలోని డజనుకు పైగా వాహనాలకు మంటలు అందుకున్నాయి. ఇది ఫిదాయిన్ శైలిలో జరిగిన ఉగ్రదాడి అనే అనుమానం వ్యక్తం అవుతోంది.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions