Friday 1st May 2026
12:07:03 PM
Home > తాజా > ‘సీఎం రమేష్ సాయం వల్లే కేటీఆర్ ఎమ్మెల్యే అయ్యాడు’

‘సీఎం రమేష్ సాయం వల్లే కేటీఆర్ ఎమ్మెల్యే అయ్యాడు’

Bandi Sanjay News Latest | భారతీయ జనతా పార్టీలో భారత రాష్ట్ర సమితి పార్టీని విలీనం చేసేందుకు కేటీఆర్ ముందుకువచ్చారని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.

ఈ వ్యాఖ్యలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. సీఎం రమేష్ చేసిన ఆరోపణలు వాస్తవమేనని పేర్కొన్నారు. దీనిపై చర్చకు సిద్ధమని, సీఎం రమేష్ ను తాను తీసుకువస్తానని కేటీఆర్ కు బండి సవాల్ విసిరారు.

2009 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కేటీఆర్ గెలవడానికి సీఎం రమేష్ ఆర్థిక సహాయం చేశాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే మొదట కేసీఆర్, కేటీఆర్ కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని కానీ సీఎం రమేష్ ఒప్పించిన తర్వాత కేటీఆర్ కు టికెట్ లభించిందన్నారు.

బీజేపీలో బీఆరెస్ పార్టీ విలీనం కోసం కేటీఆర్ సంప్రదింపులు జరిపారని సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు వాస్తవమేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ అవినీతి, కుటుంబ పాలనతో కూరుకుపోయిన బీఆరెస్ ను విలీనం చేసుకునేందుకు ఒప్పుకునే ప్రసక్తే లేదని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్రమోదీ కూడా తేల్చి చెప్పారని బండి వ్యాఖ్యానించారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions