Saturday 1st August 2026
12:07:03 PM
Home > తాజా > ‘ఆంధ్ర సినిమాలను అడ్డుకున్న ఏకైక సంస్థ తెలంగాణ జాగృతి’

‘ఆంధ్ర సినిమాలను అడ్డుకున్న ఏకైక సంస్థ తెలంగాణ జాగృతి’

Kavitha Kalvakuntla News | తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికంటే ముందు సినిమాల్లో తెలంగాణ యాసను అవహేళన చేసేవారని పేర్కొన్నారు బీఆరెస్ ఎమ్మెల్సీ కవిత.

తెలంగాణ ఉద్యమ సమయంలో నంది అవార్డులు ఇస్తున్నప్పుడు తెలంగాణ యాసను అవహేళన చేసిన ఒక క్యారెక్టర్‌కు నంది అవార్డు ఇస్తున్నరని నిరసన తెలిపిన ఒకే ఒక సంస్థ తెలంగాణ జాగృతి అని ఆమె తెలిపారు.

సినిమాలు తీసి..సినిమాల్లో వచ్చే డబ్బులను తెలంగాణలోనే ఖర్చు పెట్టి తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నరనే నేపథ్యంలో ఆంధ్ర సినిమాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చింది కూడా తెలంగాణ జాగృతే అని కవిత చెప్పారు.

ఈ మేరకు శనివారం మేడ్చెల్ జిల్లాలోని కొంపల్లిలో ‘లీడర్’ అనే పేరుతో నిర్వహించిన రాజకీయ శిక్షణా తరగతుల కార్యక్రమంలో కవిత పాల్గొని ప్రసంగించారు. 19 ఏండ్ల తెలంగాణ జాగృతి ప్రస్థానంలో తెలంగాణ సాంస్కృతిక పరిరక్షణ కోసం నిరంతరం పోరాటం చేసిందని వ్యాఖ్యానించారు.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions