Friday 1st May 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ‘పహల్గాం ఉగ్రదాడి..ఢిల్లీలోని పాక్ హైకమిషన్ లో సంబరాలు?’

‘పహల్గాం ఉగ్రదాడి..ఢిల్లీలోని పాక్ హైకమిషన్ లో సంబరాలు?’

Man spotted carrying cake to Delhi’s Pakistan High Commission | జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది మృతి చెందారు.

పాక్ ప్రేరేపిత ఉగ్రదాడి పట్ల యావత్ దేశంలో ఆగ్రహం, ఆవేదనలు వ్యక్తం అవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని పాకిస్థాన్ హై కమిషన్ ఎదుట పెద్ద ఎత్తున ప్రజలు నిరసనకు దిగారు. పాకిస్థాన్ కు వ్యతిరేకంగా నినదిస్తున్నారు. అయితే పహల్గాం లో అమాయక పర్యాటకులు మరణించిన తరుణం ఢిల్లీలోని పాక్ హై కమిషన్ లో మాత్రం సంబరాలు జరుపుకున్నట్లు కథనాలు బయటకు రావడం కలకలం రేపుతోంది.

గురువారం హైకమిషన్‌లోకి ఓ వ్యక్తి కేక్ తీసుకెళ్తుండగా, అక్కడున్న మీడియా వారు అతన్ని ప్రశ్నించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో, పలు అనుమానాలు, ఆరోపణలు వెల్లువెత్తాయి. పాకిస్తాన్ హైకమిషన్‌లో పనిచేసే ఓ ఉద్యోగి కేక్‌ను తీసుకుని కార్యాలయంలోకి వెళ్తుండగా అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులు గమనించారు.

ఈ కేక్ ఎందుకు తీసుకెళ్తున్నారని, ఏ వేడుక కోసం కేకు తీసుకెళ్తున్నారని ప్రశ్నించినప్పుడు, ఆ వ్యక్తి ఎలాంటి సమాధానం ఇవ్వకుండా నిశ్శబ్దంగా లోపలికి వెళ్లిపోయాడు. ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చకు దారి తీస్తోంది.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions