Thursday 30th April 2026
12:07:03 PM
Home > తాజా > చైనా లో ‘గోల్డ్ ఏటీఎం’..30 నిమిషాల్లో బ్యాంకులోకి నగదు

చైనా లో ‘గోల్డ్ ఏటీఎం’..30 నిమిషాల్లో బ్యాంకులోకి నగదు

China’s gold ATM melts jewellery and sends money in 30 minutes | చైనాలోని షాంఘై నగరంలో ఓ అద్భుతమైన ఆవిష్కరణ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది సాధారణ ఏటీఎం కాదు, బంగారాన్ని కరిగించి, దాని ప్యూరిటీని తనిఖీ చేసి, 30 నిమిషాల్లో డబ్బును బ్యాంకు ఖాతాలో జమ చేసే “గోల్డ్ ఏటీఎం”.

షెన్‌జెన్‌కు చెందిన కింగ్‌హుడ్ గ్రూప్ అభివృద్ధి చేసిన ఈ గోల్డ్ ఏటీఎం, షాంఘైలోని ఓ బిజీ షాపింగ్ మాల్‌లో స్థాపించబడింది. ఈ ఏటీఎం హైటెక్ సాంకేతికతతో పనిచేస్తుంది. ప్రజలు తమ బంగారు నగలు, నాణేలు లేదా బంగారు కడ్డీలను మెషీన్‌లో ఉంచితే బరువును కొలుస్తుంది.

అనంతరం 1,200 డిగ్రీల సెల్సియస్ వద్ద బంగారాన్ని కరిగించి దాని స్వచ్ఛతను తనిఖీ చేస్తుంది. ఇది కనీసం 3 గ్రాముల బరువు మరియు 50% స్వచ్ఛత కలిగిన బంగారాన్ని స్వీకరిస్తుంది. షాంఘై గోల్డ్ ఎక్స్ఛేంజ్ యొక్క రియల్-టైమ్ రేట్ల ఆధారంగా బంగారం విలువను లెక్కిస్తుంది.

సర్వీస్ ఛార్జీ తీసివేసిన తర్వాత, 30 నిమిషాల్లో డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు రికార్డు స్థాయిలో ఉండటంతో, ఈ ఏటీఎంని ఉపయోగించేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. బంగారం ధరలు పెరగడంతో, ప్రజలు తమ బంగారాన్ని నగదుగా మార్చాలనే ఆసక్తి గణనీయంగా పెరిగిందని అక్కడి వారు చెబుతున్నారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions