China’s gold ATM melts jewellery and sends money in 30 minutes | చైనాలోని షాంఘై నగరంలో ఓ అద్భుతమైన ఆవిష్కరణ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది సాధారణ ఏటీఎం కాదు, బంగారాన్ని కరిగించి, దాని ప్యూరిటీని తనిఖీ చేసి, 30 నిమిషాల్లో డబ్బును బ్యాంకు ఖాతాలో జమ చేసే “గోల్డ్ ఏటీఎం”.
షెన్జెన్కు చెందిన కింగ్హుడ్ గ్రూప్ అభివృద్ధి చేసిన ఈ గోల్డ్ ఏటీఎం, షాంఘైలోని ఓ బిజీ షాపింగ్ మాల్లో స్థాపించబడింది. ఈ ఏటీఎం హైటెక్ సాంకేతికతతో పనిచేస్తుంది. ప్రజలు తమ బంగారు నగలు, నాణేలు లేదా బంగారు కడ్డీలను మెషీన్లో ఉంచితే బరువును కొలుస్తుంది.
అనంతరం 1,200 డిగ్రీల సెల్సియస్ వద్ద బంగారాన్ని కరిగించి దాని స్వచ్ఛతను తనిఖీ చేస్తుంది. ఇది కనీసం 3 గ్రాముల బరువు మరియు 50% స్వచ్ఛత కలిగిన బంగారాన్ని స్వీకరిస్తుంది. షాంఘై గోల్డ్ ఎక్స్ఛేంజ్ యొక్క రియల్-టైమ్ రేట్ల ఆధారంగా బంగారం విలువను లెక్కిస్తుంది.
సర్వీస్ ఛార్జీ తీసివేసిన తర్వాత, 30 నిమిషాల్లో డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు రికార్డు స్థాయిలో ఉండటంతో, ఈ ఏటీఎంని ఉపయోగించేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. బంగారం ధరలు పెరగడంతో, ప్రజలు తమ బంగారాన్ని నగదుగా మార్చాలనే ఆసక్తి గణనీయంగా పెరిగిందని అక్కడి వారు చెబుతున్నారు.










