Saturday 31st January 2026
12:07:03 PM
Home > తాజా > పంట పొలంలో నకిలీ నోట్ల కలకలం

పంట పొలంలో నకిలీ నోట్ల కలకలం

FAKE CURRENCY IN AGRICULTURE LAND | ఓ రైతు పొలంలో సుమారు 40 వరకు రూ.500 నోట్ల కట్టలు దర్శనమివ్వడం కలకలం రేపుతోంది.

నల్గొండ జిల్లా దామరచర్ల మండలం నార్కట్ పల్లి-అద్దంకి రహదారి వెంబడి బొత్తలపాలెం వద్ద ఉన్న ఓ రైతు పొలంలో సోమవారం నోట్ల కట్టలు పడి ఉండడాన్ని స్థానిక రైతులు గుర్తించారు. కొన్ని కట్టలను తీసుకెళ్లారు.

విషయం తెలుసుకున్న మిర్యాలగూడ రూరల్ సీఐ ఘటన స్థలికి చేరుకుని పరిశీలించారు. నోట్లపై ‘చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ ( Children Bank Of India ) అని ఉన్నట్లు గుర్తించారు. ఇవన్నీ నకిలీ నోట్లేనని అయితే ఇవి ఇక్కడకు ఎలా వచ్చాయి అనేది మాత్రం విచారణలో మాత్రమే తేలుతుందని సీఐ వెల్లడించారు.

You may also like
ఎన్నికల బరిలో గల్వాన్ వీరుడు సంతోష్ బాబు తల్లి
కేసీఆర్ ఇంటి గోడకు సిట్ నోటీసులు..కేటీఆర్ కన్నెర్ర
బంగారం, వెండి ధరలు పతనానికి కారణం ఈయనే!
రష్యన్ అమ్మాయిలతో సెక్స్..బిల్ గేట్స్ కు రోగం?

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions