Sunday 3rd May 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ఇస్రో మరో ఘనత..ప్రపంచంలో నాలుగవ దేశంగా భారత్

ఇస్రో మరో ఘనత..ప్రపంచంలో నాలుగవ దేశంగా భారత్

ISRO Successfully Docks SpaDeX Satellites | భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో ( ISRO ) మరో అద్భుత ఘనతను సాధించింది.

నింగిలోని రెండు ఉపగ్రహాలను అనుసంధానం చేసి ఇస్రో చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు కేవలం అమెరికా, చైనా, రష్యా దేశాలు మాత్రమే ఈ ప్రక్రియను చేపడుతున్నాయి.

తాజగా స్పేడెక్స్ ( SpaDex ) డాకింగ్ ( Docking ) ప్రక్రియను ఇస్రో విజయవంతంగా పూర్తిచేయడంతో భారత్ కూడా ఆ దేశాల సరసన నిలిచింది. గతేడాది డిసెంబర్ 30న తిరుపతి జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ-సీ60 ( PSLV C60 ) లో జంట ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపింది.

పీఎస్ఎల్వీ బయలుదేరిన సుమారు 15 నిమిషాల తర్వాత స్పేడెక్స్-1బి, స్పేడెక్స్-1ఏ రాకెట్ నుండి విడిపోయాయి. అనంతరం వీటి అనుసంధానం కోసం ఇస్రో మూడు సార్లు ప్రయత్నించింది. గురువారం వీటి డాకింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తి అయినట్లు ఇస్రో ప్రకటించింది.

రెండు ఉపగ్రహాల మధ్య దూరాన్ని 15 మీటర్ల నుండి 3 మీటర్లకు తీసుకువచ్చారు. అనంతరం డాకింగ్ ప్రక్రియను ఇస్రో మొదలుపెట్టి విజయవంతంగా ముగించింది.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions