Saturday 1st August 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > బాల రాముడి దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఎంతమంది వచ్చారంటే

బాల రాముడి దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఎంతమంది వచ్చారంటే

Ayodhya Ram Mandir on Jan 1st | నూతన సంవత్సర వేడుకల వేళ అయోధ్య రామ మందిరం భక్తులతో కిక్కిరిసి పోయింది. జనవరి 1న బాల రాముడి దర్శనానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పోటెత్తారు. బుధవారం ఒక్క రోజులోనే 2 లక్షలకు పైగా భక్తులు అయోధ్య రామాలయాన్ని సందర్శించారు.


ఆయోధ్యలోని రామాలయం ప్రాంగణం అంతా భక్తులతో నిండి పోయింది. రెండు కిలోమీటర్ల మేర క్యూ లైన్లు ఏర్పడ్డాయి. ఉదయం 3 గంటల నుంచే భక్తులు ఆలయాన్ని చేరుకున్నారు. బుధవారం కేవలం 15 నిమిషాలు మాత్రమే గుడి మూసివేసినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.


స్థానిక హోటళ్లు, ధర్మశాలలు ముందుగానే నిండిపోయినట్లు అయోధ్య రామందిన ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు, డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

You may also like
‘పనికిరాని నిరుద్యోగి’.. సీజేపీ నేతపై కంగనా ఘాటు వ్యాఖ్యలు!
modi civic satyagraha call
బీ అలెర్ట్.. ప్రధాని మోదీ ‘సివిక్ సత్యాగ్రహం’ పిలుపు!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
aiswarya rajesh
విజయ్ పై ఐశ్వర్య రాజేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions