Saturday 31st January 2026
12:07:03 PM
Home > తాజా > తెలంగాణ బడిలో మళ్లీ ఫుడ్ పాయిజన్

తెలంగాణ బడిలో మళ్లీ ఫుడ్ పాయిజన్

Food Poison Again In Maganuru ZPHS School | తెలంగాణలోని పాఠశాలలో మరోసారి ఫుడ్ పాయిజన్ అవ్వడం కలకలం రేపుతోంది. వరుస ఘటనల నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది అంటూ పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కొద్దిరోజుల క్రితమే ఫుడ్ పాయిజన్ అయిన పాఠశాలలోనే మరోసారి విద్యార్థులు అస్వస్థతకు గురవ్వడం సంచలనంగా మారింది. నారాయణపేట మాగనూరు జిల్లా పరిషత్ పాఠశాలలో మంగళవారం మధ్యాహ్నం మరోసారి ఫుడ్ పాయిజన్ అయ్యింది.

దింతో 30 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాల బారిన పడ్డారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను కారులో స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇటీవలే మాగనూరు పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 50 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

You may also like
ఎన్నికల బరిలో గల్వాన్ వీరుడు సంతోష్ బాబు తల్లి
కేసీఆర్ ఇంటి గోడకు సిట్ నోటీసులు..కేటీఆర్ కన్నెర్ర
బంగారం, వెండి ధరలు పతనానికి కారణం ఈయనే!
రష్యన్ అమ్మాయిలతో సెక్స్..బిల్ గేట్స్ కు రోగం?

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions