Friday 1st May 2026
12:07:03 PM
Home > తాజా > తెలంగాణ బడిలో మళ్లీ ఫుడ్ పాయిజన్

తెలంగాణ బడిలో మళ్లీ ఫుడ్ పాయిజన్

Food Poison Again In Maganuru ZPHS School | తెలంగాణలోని పాఠశాలలో మరోసారి ఫుడ్ పాయిజన్ అవ్వడం కలకలం రేపుతోంది. వరుస ఘటనల నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది అంటూ పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కొద్దిరోజుల క్రితమే ఫుడ్ పాయిజన్ అయిన పాఠశాలలోనే మరోసారి విద్యార్థులు అస్వస్థతకు గురవ్వడం సంచలనంగా మారింది. నారాయణపేట మాగనూరు జిల్లా పరిషత్ పాఠశాలలో మంగళవారం మధ్యాహ్నం మరోసారి ఫుడ్ పాయిజన్ అయ్యింది.

దింతో 30 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాల బారిన పడ్డారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను కారులో స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇటీవలే మాగనూరు పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 50 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions