Thursday 30th April 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > తాజ్ మహల్ ను సందర్శించిన మాల్దీవుల అధ్యక్షుడు

తాజ్ మహల్ ను సందర్శించిన మాల్దీవుల అధ్యక్షుడు

Maldives President Visits Taj Mahal | మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు ( Mohamed Muizzu ) ఆయన సతిమణితో కలిసి తాజ్ మహల్ ( Taj Mahal ) ను సందర్శించారు.

మంగళవారం ప్రత్యేక విమానంలో అగ్ర ( Agra ) చేరుకున్న ముయిజ్జుకు ఉత్తర్ ప్రదేశ్ మంత్రి యోగేంద్ర స్వాగతం పలికారు.

కాగా ముయిజ్జు తాజ్ మహల్ ను సందర్శించే సమయంలో సుమరు రెండుగంటల పాటు ప్రజలకు లోనికి వెళ్ళడానికి అనుమతి ఉండదని అధికారులు ప్రకటించారు. సతీమణి తో కలిసి తాజ్ మహల్ ముందు ఫోటోలు తీసుకుంటూ ముయిజ్జు సందడి చేశారు.

నాలుగురోజుల పర్యటన నిమిత్తం భారత్ కు వచ్చిన ముయిజ్జు సోమవారం ప్రధాని మోదీ ( Pm Modi )తో సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా మాల్దీవులకు 40 కోట్ల డాలర్ల ఆర్థిక సహాయాన్ని ప్రధాని ప్రకటించారు. అనంతరం తమ దేశంలో పర్యటించాలని మోదీని మాల్దీవుల అధ్యక్షుడు కోరారు.

You may also like
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!
kalvakuntla kavitha
‘ఎస్సీల రిజర్వేషన్లు 18 శాతానికి పెంచాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions