Friday 6th June 2025
12:07:03 PM
Home > తాజా > రోజుకు సగటున 10మంది చిన్నారుల మిస్సింగ్.. హైకోర్ట్ ఆవేదన!

రోజుకు సగటున 10మంది చిన్నారుల మిస్సింగ్.. హైకోర్ట్ ఆవేదన!

High Court On Kids Missing | తెలంగాణ రాష్ట్రంలో చిన్నారుల మిస్సింగ్ పై ఆవేదన వ్యక్తం చేసింది రాష్ట్ర హై కోర్ట్. ఈ మేరకు చిన్నారులు తప్పిపోయిన కేసుల పై పత్రికల్లో వచ్చిన వార్తలను సుమోటోగా స్వీకరించింది కోర్ట్.

ఈ నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాథే మరియు జస్టిస్ అనిల్ కుమార్ లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. రాష్ట్రంలో చిన్నారుల మిస్సింగ్ (Missing Kids)అనేది తీవ్రమైన అంశంగా పరిగణించాలని తెలిపింది ధర్మాసనం.

రోజుకు 10 మంది చిన్నారుల మిస్సింగ్ అవ్వడం పై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ తరహా కేసుల్లో తెలంగాణ జాతీయ స్థాయిలో 8వ స్థానంలో ఉందని పేర్కొంది. అలాగే ఇంకా 4వేల మంది చిన్నారుల ఆచూకీ లభించకపోవడం పై ప్రభుత్వాన్ని వివరణ కోరింది.

అనంతరం కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మహిళా శిశు సంక్షేమ, హోంశాఖల ముఖ్య కార్యదర్శులకు, డీజీపీకి నోటీసులు జారీ చేసి, తదుపరి విచారణ ను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

You may also like
chenab railway bridge
ప్రపంచంలోనే ఎత్తైన బ్రిడ్జ్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ!
pawan kalyan
‘ఆరోజు సంక్రాంతి – ‌దీపావళి కలిపి జరుపుకోండి’
og movie update
Pawan Kalyan OG సినిమాలో టాలీవుడ్ హీరో కాబోయే భార్య కీలక పాత్ర!
gaddar film awards
గద్దర్ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం..ఉత్తమ నటుడు ఎవరంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions