Sunday 15th February 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > వయనాడ్ ప్రమాదం..అప్రమత్తం చేయలేదు : అమిత్ షా వ్యాఖ్యల్ని ఖండించిన సీఎం

వయనాడ్ ప్రమాదం..అప్రమత్తం చేయలేదు : అమిత్ షా వ్యాఖ్యల్ని ఖండించిన సీఎం

Wayanad Landslide News | కేరళ ( Kerala ) లోని వయనాడ్ ( Wayanad ) లో కొండచరియలు విరిగిపడిన ఘటనలు మృతుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. ఈ ప్రమాదం యావత్ దేశాన్ని కలిచి వేస్తోంది. మరోవైపు ఈ ఘటనపై కేంద్రం, కేరళ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.

కొండచరియలు విరిగిపడడాని కంటే వారం రోజుల ముందే రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించామని, అయినా కేరళ ప్రభుత్వం ప్రజల్ని తరలించలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Amit Shah ) బుధవారం రాజ్యసభలో ప్రకటించారు.

ఈ నేపథ్యంలో కేరళ సీఎం పినరయి విజయన్ అమిత్ షా వ్యాఖ్యల్ని ఖండించారు. తమకు ఎలాంటి అలెర్ట్ ( Alert ) జారీ చేయలేదన్నారు. విపత్తుకు ముందు వయనాడ్ కు కేంద్రం రెడ్ అలెర్ట్ ( Red Alert ) జారీ చేయలేదని సీఎం చెప్పారు.

హెచ్చరికలు జారీ చేయడానికి ముందే కొండచరియలు విఐగిపడ్డాయని పేర్కొన్నారు. అయినా ఇది నిందలు వేసుకునే సమయం కాదని అమిత్ షా కు సీఎం విజయన్ సూచించారు.

You may also like
ajit and sharad powar
అజిత్ పవార్ మృతిపై శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు!
republic day in kartavy path
కర్తవ్యపథ్ లో గణతంత్ర వేడుకలు!
12 Bikes Skid on a road Within Minutes in uttar pradesh
ఈ రోడ్డుకు ఏమైంది..జారిపడుతున్న బైకులు!
vehicle2vehicle communication
ఇక వాహనాలూ మాట్లాడుకుంటాయ్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions